New Projects

Ys vivekananda Reddy Death latest News | Gossips9

వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు

Ys vivekananda Reddy ,GOSSIPS9

ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. కేసులో  నిందితుడు అని భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో తెలిపారు. సీఎం జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా లేఖ రాశారు. సూసైడ్ నోట్ ను డాక్టర్లు అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఐ రాములు తీవ్రంగా వేధించినట్లుకుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అందుకు న్యాయమూర్తి కిశోర్ కుమార్ అనుమతి ఇచ్చారు. దాన్ని తర్వాత వెంటనే పులివెందుల డీఎస్పీ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్ ను తీసుకెళ్లారు. విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో 60 మందిని ప్రశ్నించారు. చివరకు సాక్ష్యాలు తారుమారుచేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ పై కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. 90 రోజుల రిమాండ్ అనంతరం వీరికి జూన్ 27 కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొత్తం ప్రాసెస్ లో శ్రీనివాస రెడ్డే నిందితుడిగా పోలీసులు ఇన్ని రోజులు భావిస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి మరణంతో కేసు మొదటికి వచ్చినట్టు అయింది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. 2019, మార్చి 15 తేదీ తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. మొదట అతను గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం బయటకు వచ్చింది.అప్పటి నుండి కేసు చుట్టూ ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి కాని.. అసలు నేరస్థులను మాత్రం పట్టుకోలేక పోయారు. మరి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

No comments:

Post a Comment